Sunday, May 5, 2024

Political | పక్కా స్కెచ్చేశారు.. షిండేని సీఎం చేయాలన్నది అమిత్​షా ప్లాన్​: నితిన్​ దేశ్​ముఖ్​

మహా వికాస్​ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నెల రోజుల ముందే ఏకనాథ్ షిండే సీఎం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ శుక్రవారం ఆరోపించారు. దీనికి చాలా పక్కాగా స్కెచ్చేశారని చెప్పారు. అయితే.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు మాత్రమే తెలుసునని దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

శివసేన (UBT) నాయకుడు పార్టీ పోడ్‌కాస్ట్ సిరీస్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. “అవాజ్ కుంచన” అసోంలోని గౌహతిలో షిండే క్యాంపునకు వెళ్లినప్పుడు మొదట్లో షిండేతో చేరిన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో నితిన్​ దేశ్​ముఖ్​ ఒకడు. అయితే ఆ తర్వాత తిరిగి వచ్చి థాకరే వర్గంలో చేరాడు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే పేరును తాను సూచించానని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. అది నిజం కాదు. అధికార మార్పిడికి నెల రోజుల ముందు షిండే సీఎం అవుతారని తమకు తెలుసు. షిండే సీఎం కావాలని ముందే నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు అని దేశ్‌ముఖ్‌ చెప్పినట్లు ఓ మీడియాలో కథనం వచ్చింది.

- Advertisement -

ఇక.. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన ఆరు నుండి ఏడు నెలల తర్వాత మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రణాళికలు ప్రారంభమయ్యాయని దేశ్‌ముఖ్ అన్నారు. పార్టీకి దీని గురించి సూచన వచ్చిందని, అయితే దాదాపు 20 నుండి 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నట్టు తాము అంచనా వేసినట్టు చెప్పారు. అయితే.. ఇది తమపై (MVA ప్రభుత్వంపై) ఎలాంటి ప్రభావం చూపదని భావించారని ఆయన పేర్కొన్నారు. కాగా, సీనియర్ నాయకులందరూ ఇప్పటికే ఏక్‌నాథ్ షిండేతో ఉన్నారని వెల్లడించిన దేశ్‌ముఖ్, గులాబ్రావ్ పాటిల్ తర్వాత షిండే వర్గంతో చేతులు కలిపారని పేర్కొన్నారని..  దీని కోసం రెండు సంవత్సరాలుగా ట్రాప్​ చేశారు. కైలాస్ పాటిలా, షిండే వర్గం ప్రణాళికలు ఉద్ధవ్ ఠాక్రేకు ఎలా తెలియజేయాలో తనకు తెలియదని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement