Saturday, April 27, 2024

ఎకె 203 రైఫిల్స్‌.. రక్షణ విభాగంలో భారత్ మరో అడుగు..

రక్షణ విభాగంలో స్వయం సమృద్ధివైపు భార‌త్ మరో అడుగు వేసింది. 5 లక్షలకు పైగా AK-203 రైఫిల్స్ తయారీ కోసం రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రైఫిల్స్ ను ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో తయారు చేయనున్నారు. భారత డిఫెన్స్ సామ‌గ్రి తయారీ హబ్ గా యూపీ అవతరించనుందని కేంద్ర వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కొనుగోళ్ల నుంచి మేక్ ఇన్ ఇండియా స్థానికి భారత్ చేరుతోందని అధికారులు తెలిపారు. రష్యా భాగస్వామ్యంతో ఈ రైఫిల్స్ ను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. 30 ఏళ్లుగా వినియోగిస్తున్న INSAS రైఫిల్స్ స్థానంలో లేటెస్ట్ వెప‌న్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement