Sunday, April 28, 2024

RR | చెరువులోని చేపలన్నీ మృత్యువాత.. విషం క‌లిపారేమోన‌ని మత్స్యకారుల ఆందోళ‌న‌ (వీడియో)

శంకర్​పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలో ఘోరం జ‌రిగింది. శంకర్‌ప‌ల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండకల్ గ్రామంలోని ఓ చెరువులో చేప‌ల‌న్నీ మృతిచెందాయి. ముదిరాజ్ సంఘం వారికి చెందిన గ్రామ చెరువులోని చేపలు ఇలా అన్నీ చ‌నిపోయి నీళ్ల‌మీద తేలి క‌నిపించాయి. చెరువులోనికి వచ్చే నీటిలో ఎక్కడినుండి అయిన కెమికల్ కానీ, మ‌రేదైనా విష‌పు గుళిక‌లు క‌లిశాయా.. లేక గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా విషం కలిపారా ? అని మ‌త్స్య‌కారులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ విష‌యాన్ని మొకిల పోలీసులకు కొండకల్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మన్నే నర్సింలు ఫిర్యాదు చేశారు. చెరువులోని చేపలన్ని చ‌నిపోవ‌డంతో వాటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింద‌న్నారు. లక్షలాది రూపాయల నష్టం వాటిళ్లింద‌ని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement