Sunday, May 5, 2024

TRS: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ సమావేశం.. జిల్లావ్యాప్తంగా పలు తీర్మానాలకు నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు.. హైదరాబాదులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమైయ్యారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో 100% తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 24వ తేదీన  నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న గ్రామ పంచాయితీ తీర్మానాలు, 26వ తేదీన మండల పరిషత్ తీర్మానాలు, 27న జిల్లా, మండల రైతుబంధు సమితిల తీర్మానాలు, చేయాలని నిర్ణయించారు. అలాగే, 28న మార్కెట్ కమిటీలు, PACS కమిటీల తీర్మానాలు, 29న DCCB,DCMS కమిటీల తీర్మానాలు, 30వ తేదీన జిల్లా పరిషత్ తీర్మానాలు, 31వ తేదీన అన్ని మున్సిపాలిటీల పాలకవర్గ తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement