Tuesday, May 21, 2024

బస్సుని ఢీ కొన్న ట్రక్కు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు

వేగంగా వస్తున్న ట్రక్కు..బస్సుని ఢీ కొంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్‌ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు 60 మంది ప్రయాణికులతో పంజాబ్‌ రాష్ట్రమైన లుధియాన నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ కి వెళ్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపైకి రాగానే వేగంగా వస్తున్న డీసీఎం వాహనం బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement