Monday, April 29, 2024

చౌటుప్ప‌ల్‌లో 93 ల‌క్ష‌ల న‌గ‌దు సీజ్.. బీజేపీకి చెందిన‌వంటున్న పోలీసులు

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర‌ రూ. 93 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అమౌంట్‌ని హైద‌రాబాద్ నుంచి మునుగోడుకు త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. న‌గ‌దు త‌ర‌లిస్తున్న వ్య‌క్తి నామ్ దేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.

కాగా, నామ్‌దేవ్.. తాను బీజేపీ నేత వివేక్ కారు డ్రైవ‌ర్ ఐల‌య్య యాద‌వ్ సూచ‌న మేర‌కు డ‌బ్బులు తీసుకెళ్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. శేరిలింగంప‌ల్లిలో ఓ మాజీ ఎమ్మెల్యే అనుచ‌రుడి నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో నామ్ దేవ్ డ‌బ్బు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత కారు స్టెఫ్నీ కింద డ‌బ్బును అమర్చి త‌ర‌లిస్తున్నాడు. అయితే రూ. 93 ల‌క్ష‌లు త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఆ వాహ‌నాన్ని త‌నిఖీ చేసి న‌గ‌దును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement