Thursday, May 2, 2024

Flash: యమున ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్‌ప్రెస్‌ వేపై మథుర వద్ద వ్యాగనార్‌ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. వ్యాగన్ఆర్‌లో ప్రయాణిస్తున్న కుటుంబం వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్నసమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. మధురలోని నౌజీల్‌లో 68వ మైలురాయి వద్ద ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement