Wednesday, May 8, 2024

కొత్త‌గా 5,874క‌రోనా కేసులు.. 25మంది మృతి

నేడు కొత్త‌గా 5,874క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా 25మంది మృతి చెందారు. యాక్టివ్‌ కేసులు 50 వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 49,015 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 5,31,533 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 8,148 మంది వైరస్‌ నుంచి బయటపడగా, 25 మంది మరణించారు. ఇందులో కేరళలోనే 9 మంది చనిపోయారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 శాతం ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇప్పటివరకు 2,20,66,66,261 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement