Sunday, April 28, 2024

ప‌శ్చిమ బెంగాల్ లో 40వేల దుర్గ‌మ్మ మండ‌పాలు-మూడు ల‌క్ష‌ల మందికి ఉపాధి

ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా 40వేల దుర్గ‌మ్మ మండ‌పాలు ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల వ్యాపారం జరిగినట్టు ఫోరమ్ ఫర్ దుర్గా స్తాబ్ (ఎఫ్ఎఫ్‌డీ) తెలిపింది. దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు లావాదేవీలు జరుగుతాయని ఆ సంస్థ చైర్మన్ పార్థో ఘోష్ తెలిపారు. కోల్‌కతా నగరంలోనే ఇవి మూడు వేలకు పైగా ఉన్నట్టు పేర్కొన్నారు. దసరా వేడుకల సందర్భంగా దాదాపు 3 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. దసరా ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారని పార్థా ఘోష్ తెలిపారు. వీరిలో మండపాలు నిర్మించేవారు, విగ్రహాలు తయారుచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్ సేవలందించేవారు ఉంటారని ఆయన వివరించారు. ఉత్సవాల సందర్భంగా వీరందరికీ ఉపాధి లభిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement