Friday, May 17, 2024

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం వద్ద అదుపు తప్పి కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఇందిరా, శాంతి, కుటుంబరావు,ప్రిన్సీ(6 నెలలు)గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement