Friday, March 29, 2024

3rd ODI: కివీస్ టార్గెట్ 386 పరుగులు


భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇండియా జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేయడంతో కివీస్ కు భారీ టార్గెట్ ఇచ్చారు. భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 101, శుభమాన్ గిల్ 112 పరుగులు, హార్ధిక్ పాండ్యా 54 పరుగులు చేశారు. కివీస్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 50 ఓవర్లలో 386 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement