Wednesday, May 1, 2024

Breaking: చొప్పదండిలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కట్నపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన బైరి శంకరయ్య అతని భార్య జమున, కుమారుడు శ్రీధర్ లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితమే కుమార్తె వివాహం చేశారని, కుటుంబమంతా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement