Friday, April 26, 2024

ఆ ఉప ఎన్నిక వెనుక రూ.22వేల కోట్ల కుంభ‌కోణం.. జ‌గ‌దీశ్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉందంటూ రాష్ట్ర మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఓ కుటుంబం స్వార్థం కోసం..వారి వ్యాపార అభివృద్ధి కోసం మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారంటూ పరోక్షంగా కోమటిరెడ్డి కుటుంబంపై మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు సంధించారు. మునుగోడులో గెలుపు కోసం ఏ పార్టీ ఎన్ని యత్నాలు చేసినా గెలుపు సాధించేది మాత్రం టీఆర్ఎస్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. అసంతృప్తులతో టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదని జగదీశ్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement