Wednesday, May 1, 2024

బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం.. 22 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బలూచిస్థాన్ ప్రాంతంలో ఓ వ్యాన్ లోయలోకి పడిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం నుంచి ఒక్క బాలిక మాత్రమే గాయాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది.

ఈరోజు ఉదయం 23 మందితో వ్యాన్‌ జోబ్‌కు వెళ్తున్న సమయంలో.. అక్తర్‌ జాయ్‌ సమీపంలో కొండపై నుంచి వ్యాన్‌లో లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ ఖాసిం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement