Sunday, May 5, 2024

2023-28 ఐపీఎల్ మీడియా టెండర్… రూ.60వేల కోట్లు ?

2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం రానున్నది. సుమారు రూ.50 వేల కోట్ల హ‌క్కులు అమ్ముడుపోయిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 60వేల కోట్లు ఆర్జించే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎలరా సెక్యూరిటీస్ అంచనా వేసింది. భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్, నానాటికీ పెరుగుతుంద‌ని, ఐపీఎల్ విస్తృతి కారణంగా ఈ డీల్ ద్వారా బీసీసీఐ మరింత సంపన్న బోర్డుగా మార‌నున్న‌ట్లు సదరు సంస్థ అంచనా వేసింది.

గత నెలలో మీడియా హక్కులకు సంబంధించిన టెండర్ ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12న ఇందుకు సంబంధించిన ఈ-వేలాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవడానికి బడా కంపెనీలన్నీ క్యూకట్టాయి. ఈ జాబితాలో ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా ఉన్న డిస్నీ స్టార్ తో పాటు సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్, అమెజాన్, ఆపిల్, గూగుల్ లు బిడ్స్ వేశాయి. కాగా ఐపీఎల్ మీడియా హక్కుల కోసం కనీస ధర ను బీసీసీఐ రూ.32,890 కోట్లుగా నిర్ణయించింది.

దీనిపై ఎలరా సెక్యూరిటీస్ స్పందిస్తూ.. ‘భారత్ లో క్రికటెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ద్వారా స్పష్టమైందని, భారత్ లోని క్రీడల్లో క్రికెట్‌ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నదని, ఇది ఐపీఎల్ మీడియా హక్కుల వృద్ధికి ఊతమిస్తుందని ఆశిస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ డీల్ వ‌ల్ల ప్రస్తుతం 54 శాతమున్న ఐపీఎల్ వాటా 74 శాతానికి పెరిగే అవకాశముందని ఆ సంస్థ చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement