Thursday, April 25, 2024

Breaking: ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు హనుమాన్‌పేట బైపాస్‌ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్‌ నుంచి బాపట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement