Friday, May 3, 2024

Covid Flash: దేశంలో పెరిగిన కరోనా.. 24 గంటల్లో ఎన్ని కేసులంటే…

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, నిన్నటితో పోల్చితే నేడు కేసులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1778 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,12,749 కు చేరింది. ఇందులో 4,24,73,057 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,16,605కి పెరిగింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2542 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో 23,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 80.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,81,89,15,234 కరోనా వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేసిటన్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement