Friday, May 3, 2024

బెంగళూరులో దారుణం.. 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ 17 ఏళ్ల బాలికపై తెలిసిన అబ్బాయిలు కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఇవ్వాల (శనివారం) పోలీసులు ధ్రువీకరించారు. అయితే.. నిందితులపై  చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు బయటరాయణపుర పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే.. నిందితుల కోసం గాలింపు చేపట్టామని, వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఆ బాలిక రెండేళ్లుగా నిందితుడికి తెలుసు అని, ఆ బాలిక ప్రైవేట్ ఫొటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడి రేప్​ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement