Tuesday, April 23, 2024

యువతిపై అత్యాచారయత్నం.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

వాజేడు, (ప్రభ న్యూస్): యువతిపై అత్యాచారయత్నానికి యత్నించిన యువకుడిపై కేసు నమోదైన ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాజేడు మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి కృష్ణాపురంలోని త‌మ బంధువుల ఇంటికి వెళ్తుండ‌గా నిన్న (శుక్రవారం) ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చెరుకూరు వద్ద ఆటో కోసం ఎదురుచూస్తుంటే ఆమె అవసరాన్ని అదునుగా చేసుకుని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన యువకుడు ఆలం కృష్ణ తేజ బైకుపై తీసుకెళ్తాన‌ని న‌మ్మించాడు.

మార్గమధ్యలో ఎర్రబోరు అడ‌విలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడాలని చూశాడు. యువతిపై అత్యాచారయత్నానికి యత్నించగా అతని నుండి త‌ప్పించుకుని బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఆమె బంధువులు పేరూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసి విచార‌ణ జరుపుతున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement