Thursday, May 9, 2024

ఒకే వేదిక‌పై 11,304మంది క‌ళాకారులు.. గిన్నిస్ బుక్ లో చోటు

ఒకే వేదిక‌పై 11,304మంది క‌ళాకారులు..నృత్య‌కారులు బిహూ నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో గాయకులతో పాటు అస్సాం సంప్రదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతేకాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి రూ.25 వేలు గ్రాంట్ ప్రకటించింది. బిహు నృత్య ప్రదర్శన అనంతరం అదే స్టేడియంలో 2548 మంది డ్రమ్మర్స్ డ్రమ్స్‌ వాయించారు. ఈశాన్య రాష్ట్రం అస్సాం గువాహటిలోని సరుసజై స్టేడియంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ జరిగింది. అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement