జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుంజ్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలకు కూంబింగ్ నిర్వహించాయి. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని జమ్మూ జోన్ ఏడీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement