Monday, April 29, 2024

హెచ్చరిక: బ్రిటన్‌లో థర్డ్ వేవ్ సంకేతాలు

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అతలాకుతలం కాగా, బ్రిటన్‌లో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. ఇంగ్లండ్‌లో బయటపడుతున్న కొత్త కేసుల్లో నాలుగింట మూడొంతులు భారత్‌లో బయటపడిన బి.1.617 రకానివేనని అన్నారు. మున్ముందు ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే, పరిస్థితి చూస్తుంటే మాత్రం మున్ముందు ఉద్ధృతమయ్యేలా కనిపిస్తోందని అన్నారు. ఈ నెల 21 నుంచి తిరిగి అన్ని కార్యకలాపాలను అనుమతించి, మునుపటి స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచనను పక్కనపెట్టాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రొఫెసర్ రవిగుప్తా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement