Friday, May 3, 2024

విశాఖలో కేఏ పాల్‌కు పాలాభిషేకం

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యటానికి వీలు లేదంటూ అన్ని పార్టీలు ఈ రోజు బందుకు పిలుపునిచ్చాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అన్ని పార్టీలు బందుకు మద్దతు ఇస్తూ రోడ్లపై నిరసనలు తెలిపారు. కాగా కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర మాత్రం కేఏ పాల్ చిత్ర పటానికి స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు పాలాభిషేకం చేసి ప్రశంసలు కురిపించారు. జై కొడుతూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్‌ వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆకాశానికి ఎత్తేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement