Friday, April 26, 2024

దుర్గమ్మ సేవలో బెంగాలీ నటీ మౌబానీ సర్కార్

విజ‌య‌వాడ – ప్రముఖ బెంగాలీ నటీ మౌబానీ సర్కార్ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పీసీ సర్కార్ జూనియర్ కుమార్తె అయిన మౌబానీ సర్కార్ అనేక బెంగాలీ చిత్రాల్లో కథానాయికగా నటించారు. తన నటకౌశలంతో అభిమానులను అలరింపజేస్తున్న మౌబానీ ఒడిస్సీ నృత్యకారిణిగా, చిత్రకారిణిగా, కుటుంబ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ మెజీషియన్ గాను ఘనత వహించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆమె ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గమ్మను దర్శించుకున్నారు. జగన్మాతను దర్శించుకున్న మౌబానీ ప్రత్యేక పూజలు జరిపించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా మౌబానీ మీడియాతో మాట్లాడుతూ బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందాన్నిచ్చిందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన తనకు మహా శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. త్వరలో తెలుగులో ఓ సినిమాలో నటించనున్నట్లు వెల్లడించిన మౌబానీ బాహుబలి లాంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement