Saturday, April 27, 2024

Virat Kohli | కుర్రాళ్లు కుమ్మేశారు.. కోహ్లీ ప్రశంసలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది భార‌త్. ఇక‌ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

కాగా, టీమ్ఇండియా సిరీస్ గెల‌వ‌డంపై టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో టీమ్ఇండియా చారిత్రాత్మ‌క విజ‌యం సాధించిందని కోహ్లి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement