Friday, May 3, 2024

ఉత్కంఠ‌పోరులో గుజ‌రాత్ జెయింట్స్ పై యూపీ వారియ‌ర్స్ విజయం

ముంబై – మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ లో గుజ‌రాత్ జెయింట్స్ మ‌రో ప‌రాభ‌వం ఎదురైంది.. డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియ‌ర్స్ చేతిలో ఓడిపోయింది. ఉత్కంఠ‌పోరులో యూపీ వారియ‌ర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రేస్ హ్యారిస్ (59) అర్ధ సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించింది. 170 లక్ష్య ఛేద‌న‌లో కిమ్ గార్త్ దెబ్బ‌కు ఆ జ‌ట్టు 105 ర‌న్స్‌కే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ ద‌శ‌లో సోఫీ ఎక్లెస్టోన్, గ్రేస్ హ్యారిస్ 8వ వికెట్‌కు 70 ర‌న్స్ చేశారు . హ్యారిస్ 26 బంతుల్లో 56 పరుగులు చేయగా సోఫీ 12 బంతులలో 22 పరుగులు చేసి జాట్టును గెలిపించారు.. కిమ్ గార్త్ అయిదు వికెట్లు తీసినా గుజరాత్ జట్టును గెలిపించ లేకపోయింది.

మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జెయింట్స్ 169 ప‌రుగులు చేసింది. హ‌ర్లీన్ డియోల్ (46) రాణించ‌డంతో ఆ జ‌ట్టు అంత స్కోర్ చేయ‌గ‌లిగింది. 76 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌శ‌లో.. గార్డ్‌న‌ర్, హ‌ర్లీన్ వేగంగా ఆడి జ‌ట్టు భారీ స్కోర్‌కు బాట‌లు వేశారు. ఓపెన‌ర్లు స‌బ్బినేని మేఘ‌న (24), సోఫియా డంక్లే (13) స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆషే గార్డ్‌న‌ర్ (25), ద‌య‌లాన్ మేహ‌ల‌త (21 నాటౌట్‌) చివ‌ర్లో ధాటిగా ఆడారు. యూపీ వారియ‌ర్స్ బౌల‌ర్ల‌లో ఎక్లెస్టోన్ దీప్తి శ‌ర్మ త‌లా రెండు వికెట్లు తీశారు. అంజ‌లి స‌ర్వాని, త‌హిలా మెక్‌గ్రాత్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement