Saturday, July 27, 2024

IndvsEng | నాలుగో టెస్ట్‌కు ఇంగ్లాండ్‌ టీమ్ ఇదే..

భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా జ‌రిగే నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది భార‌త్. కాగా, రేపు జ‌ర‌గ‌నున్న టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేయాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్‌ జట్టు బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో రాంచీ టెస్టుకు టీం తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

ఇంగ్లాండ్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. పేసర్‌ మార్క్‌వుడ్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌ బోర్డు ఓలీ రాబిన్‌సన్‌ను జట్టులోకి తీసుకుంది. అండర్సన్‌కు మరోసారి అవకాశం దక్కింది. షోయబ్‌ బషీర్‌ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌ ఇద్దరు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతోనే బరిలోకి దిగింది.

నాలుగో టెస్ట్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టు :

జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్‌ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్

Advertisement

తాజా వార్తలు

Advertisement