ఐపీఎల్-2023 సందడి మొదలైంది. డిసెంబర్ 23 నుంచి కోచి వేదికగా ఆటగాళ్ల మినీ వేలం జరగనుంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లలోని క్రీడాకారుల జాబితాను ఐపీఎల్ పాలక మండలికి అందజేశాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సిదేమిటంటే.. ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీలు కొంత మంది క్రీడాకారులను వదలుకున్నారు. దీంతో ఆ ఆటగాళ్ల పేర్లు డిసెంబర్ 23న జరిగే వేలం జాబితాలోకి చేరనున్నాయి. ఈసారి వివిధ దేశాల క్రికెటర్లు కొందరు స్వయంగా ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోగా, మరికొందరు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారు. ఏఏ జట్లు ఏఏ క్రీడాకారులను వదలుకున్నది, తమ జట్టులోనే అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తోపాటు ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హూవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్ కండ్, సందీప్ శర్మ, వ్రిట్టిక్ ఛటర్జీను విడుదల చేసి, రూ.32.2 కోట్లు మిగుల్చుకుంది.
ముంబై ఇండియన్స్
అన్మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, డానియల్ శామ్స్, ఫాబియన్ అల్లెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్ విడుదలయ్యారు. రూ.20.55 కోట్ల పర్స్ మిగిలి ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్
ప్యాట్ కమిన్స్, శామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ నబి, చమిక కరుణరత్న, ఆరోన్ ఫించ్, అలెక్స్ హిల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రతమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ ను కేకేఆర్ విడుదల చేసింది. ఢిల్లి విడిచిపెట్టిన శార్ధూల్ ఠాకూర్ ను తీసుకుంది. రూ.7.05 కోట్లు మిగిలాయి.
చెన్నై సూపర్ కింగ్స్
డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిషాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కేఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్ ను సీఎస్కే విడుదల చేసింది. ఈ ఫ్రాంచైజీ వద్ద 20.45 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో మినీ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్
కేన్ విలయమ్సన్, నికోలస్ పూరన్, జగదీష్ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెఫర్డ్, సౌరభ్# దూబే, సీన్ అబ్బాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుషాంత్ మిశ్రా, విష్ణు వినోద్ ను వదిలేసుకుంది. రూ.42.25 కోట్లు మిగిలాయి.
ఢిల్లి క్యాపిటల్స్
శార్థూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హబ్బార్, కేఎస్ భరత్, మణిదీప్ సింగ్ ను విడుదల చేసింది. రూ.19.45 కోట్ల పర్స్ ఉంది.
రాజస్థాన్ రాయల్స్
అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిషెల్, జేమ్స్ నీషామ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్ నిల్, రస్సీ వాన్ డర్ డుస్సెన్, శుభమ్ గార్గ్, తేజాస్ బరోకాను రాజస్థాన్ జట్టు వదిలేసుకుంది. రూ.13.2 కోట్ల మిగులు నిల్వలు ఉన్నాయి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
జేసన్ బెహన్డార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లవ్ నిత్ సిసోడియా, షెర్ఫేన్ రూదర్ ఫోర్డ్ ను విడిచి పెట్టింది. రూ.8.75కోట్ల నిధులు ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్
ఆండ్య్రూ టై, అంకింత్ రాజ్ పుత్, దుష్మంత చమీర, ఎవిన్ లెవిస్, జేసన్ #హూల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ ను విడుదల చేసింది. రూ.23.35 కోట్లు మిగిలాయి.
గుజరాత్ టైటాన్స్
రహ్మనుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గుర్ కీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరాన్ ను వద్దనుకుంది. రూ.19.25 కోట్లు మిగిలాయి.