Monday, April 29, 2024

Breaking | ఛేజింగ్​లో తడబడుతున్న టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్​ కష్టాల్లో కూరుకుపోయింది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్​ చేయగా టీమిండియాకు భారీ టార్గెట్ సెట్​ చేసింది. ఆసీస్​ జట్టు నిర్ణీత ఓవర్లలో 352 పరుగులుచేయగా ఇండియా 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. టాప్​ ఆర్డర్​ పర్వాలేదు అనిపించుకున్నా మిడిలార్డర్​ దెబ్బేసినట్టే కనిపిస్తోంది. దీంతో 37 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోరు 243 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయింది. ఇందులో రోహిత్​ (81), వాషింగ్టన్​ సుందర్​ (18), కోహ్లీ (56), రాహుల్​ (26), సూర్యకుమార్​ (8) పరుగులు చేశారు. ఇక.. ప్రస్తుతం శ్రేయస్​ అయ్యర్​, రవీంద్ర జడేజా పోరాటం చేస్తున్నారు. మరో 72 బంతుల్లో 110 పరుగులు చేయగలరా? లేదా అన్నది సందేహంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement