ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయగా టీమిండియాకు భారీ టార్గెట్ సెట్ చేసింది. ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 352 పరుగులుచేయగా ఇండియా 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. టాప్ ఆర్డర్ పర్వాలేదు అనిపించుకున్నా మిడిలార్డర్ దెబ్బేసినట్టే కనిపిస్తోంది. దీంతో 37 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోరు 243 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయింది. ఇందులో రోహిత్ (81), వాషింగ్టన్ సుందర్ (18), కోహ్లీ (56), రాహుల్ (26), సూర్యకుమార్ (8) పరుగులు చేశారు. ఇక.. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా పోరాటం చేస్తున్నారు. మరో 72 బంతుల్లో 110 పరుగులు చేయగలరా? లేదా అన్నది సందేహంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు.
Breaking | ఛేజింగ్లో తడబడుతున్న టీమిండియా.. 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు
Advertisement
తాజా వార్తలు
Advertisement