Monday, April 29, 2024

టీ20 వరల్డ్ కప్.. పాక్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడంటే..

క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడులైంది. అక్టోబరులో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​ల షెడ్యూల్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. షెడ్యూల్​ ప్రకారం భారత్​-పాకిస్థాన్​ మధ్య అక్టోబరు 24న మ్యాచ్​ జరగనుంది.  

టీ 20 ప్రపంచకప్ ఒమన్, యుఎఇలో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య జరుగుతుంది. అక్టోబర్ 24న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు దుబాయ్‌లో భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్  ప్రారంభమవుతుందని ఐసీసీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement