Friday, May 3, 2024

భారత్​, శ్రీలంక టీ20, వన్డే సిరీస్​లు.. టీమ్​ వివరాలు ప్రకటించిన లంక

కొలంబో: భారత్‌తో జూన్‌ 23 నుంచి టీ20 సిరీస్‌, జులై 1 నుంచి వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్‌ చమారి ఆటపట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయగా, హాసిని పెరెర, కవిషా దిల్‌హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఒషాధి రణసింఘే, సుగందిక కుమారి, ఇనోకా రణవీర, అచిని కులసురియా, హర్షిత సమరవీక్రమ, విష్మి గుణరత్నే, మల్సా స్నేహాని, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, రష్మి డి సిల్వా, హన్సిమ కరుణరత్నె, కౌషని నుథ్యాంగణ, సత్య సందీపణి, థారిక సెవ్వాండిలను ఎంపిక చేశారు.

జూన్‌ 27 నుంచి 27 వరకు డంబుల్లాలోని రణ్‌గిరి డంబుల్లా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టీ20 సిరీస్‌ జరుగనుండగా, జులై 1 నుంచి 7 వరకు పల్లెకెల్లె స్టేడియంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ టీమిండియాతో ఆడనుంది. భారత జట్టును ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement