Monday, April 29, 2024

వన్డే సిరీస్‌ శ్రీలంక కైవసం..

జింబాబేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 2-1తేడాతో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడోవన్డేలో శ్రీలంక జింబాబేపై 184పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. చరిత్‌ అసలెంక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారాన్ని దక్కించుకోగా, నిశాంక ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌గెలిచిన లంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50ఓవర్లలో శ్రీలంక 9వికెట్లకు 254పరుగులు చేసింది.

లంక ఓపెనర్‌ నిశాంక (55), అసలంక (52) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం 255 పరుగులు విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే 70పరుగులుకే కుప్పకూలింది. లంక బౌలర్లు విజృంభించడంతో జింబాబ్వే 24.4ఓవర్లలో 70పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 184పరుగుల భారీ తేడాతో గెలిచిన శ్రీలంక 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement