Friday, May 17, 2024

పాక్‌పై శ్రీలంక జయభేరి.. 246 పరుగుల తేడాతో గెలుపు

పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 246 పరుగులు భారీ ఆధిక్యతతో తిరుగులేని విజయం సాధించింది. బాబర్‌ అజీమ్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ జట్టును 261 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో శ్రీలంక విజయం ఖాయమైంది. స్పిన్నర్‌ భరత్‌ జయసూర్య మరోసారి 5 వికెట్లు పడగొట్టి లంకేయుల విజయంలో కీలకపాత్ర పోషించాడు. జయసూర్య 5 వికెట్లు పడగొట్టడం ఇది నాలుగోసారి. గాలేలో జరిగిన రెండో టెస్టులో విజయంతో శ్రీలంక సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 176 పరుగులతో పటిష్ట స్థితిలో ఉండగా జయసూర్య, రమేష్‌ మొండిస్‌ దెబ్బతీశారు. రమేష్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో 261 పరుగులకో పాకిస్తాన్‌ ఆలౌటైంది. బాబార్‌ అజామ్‌ భారీగా పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement