Wednesday, May 15, 2024

ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్.. భార‌త్ ల‌క్ష్యం 147.. రెండో ఓవ‌ర్‌లోనే అవుటైన కెప్టెన్‌ రోహిత్‌

ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్, శ్రీలంక మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. 5 వికెట్ల న‌ష్టానికి 20 ఓవ‌ర్ల‌కు శ్రీలంక 146 ప‌రుగులు చేసి భార‌త్‌కు 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక‌ను కెప్టెన్ శ‌న‌క ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దినేశ్ 22, చ‌మికా క‌రుణార‌త్నే 12 ప‌రుగులు చేశారు. ఇక‌.. భార‌త బౌల‌ర్ల‌లో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఒకటి, ర‌వి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం కాగానే మూడో ఓవ‌ర్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అవుట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement