Sunday, April 28, 2024

Dhoni FAN : ఇంత అభిమానమా…పిల్ల‌ల ఫీజు డ‌బ్బుల‌తో టిక్కెట్లు…

ఐపీఎల్ 2024 సీజన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ తన పట్టు నిలుపుకొంటోంది. ఒకట్రెండు అపజయాలు ఎదురైనా వెనక్కి తగ్గట్లేదు. దూకుడుగా ముందడుగు వేస్తోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ ఎల్లో ఆర్మీ.. సమష్టిగా సత్తా చాటుతోంది. ఆరోసారి ఛాంపియన్‌గా నిలవడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది.

- Advertisement -

అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో విజయాలను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టడానికి సమాయాత్తమౌతోంది. ఈ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో షెడ్యూల్ అయింది.

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అతని కోసం తమిళ ఫ్యాన్స్ దేనికైనా వెనుకాడరు. ఓ మాస్ హీరో లెవెల్‌లో అతణ్ని అభిమానిస్తారు. ఆరాధిస్తారు. గత ఏడాది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల ఒకరోజు వాయిదా పడ్డప్పటికీ- అహ్మదాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్ ఫామ్ మీద పడుకుని మరీ అక్కడే గడిపారే తప్ప వెనక్కి రాలేదు. ఇప్పుడు మరో చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని ఎంఎస్ ధోనీని చూడ్డం కోసం అని ఏకంగా బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు కొన్నాడు. ఈ టికెట్ల విలువ 64,000 రూపాయలు. తన కూతురి స్కూల్ ఫీజు కోసం దాచిన డబ్బులట అవి. స్కూల్ ఫీజ్ కట్టడానికి ఇంకా కొంత సమయం ఉందని, ఆ లోగా ఎలాగోలా ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని భావించాడట.

ధోనీ ఆడే ఆటను చూడ్డానికని 64,000 రూపాయలను పెట్టి టికెట్లు కొన్నానని చెప్పాడా తమిళనాడుకు చెందిన అభిమాని. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వాళ్లందరూ ధోనీని చూడాలని చెప్పడంతో అందరికీ బ్లాక్‌లో టికెట్లు కొన్నట్లు వివరించాడు. ఒక కూతురికి ఇంకా స్కూల్ ఫీజ్ కట్టాల్సి ఉందని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement