Wednesday, May 1, 2024

Slow over rate : హార్దిక్‌ పాండ్యకు జరిమానా..

ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 9 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అయితే ముంబయి కెప్టెన్ హార్దిక్‌ పాండ్యకు జరిమానా విధించారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతడికి రూ. 12 లక్షల ఫైన్‌ను విధించినట్లు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను పూర్తి చేయడంలో ముంబయి విఫలమైంది.

దీంతో చివరి రెండు ఓవర్లలో సర్కిల్ అవతల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ మేరకు ఐపీఎల్‌ కమిటీ ప్రకటన జారీ చేసింది. ”ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ హార్దిక్‌కు స్లో ఓవర్‌రేట్‌ కారణంగా జరిమానా విధించాం. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది” అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement