Monday, May 6, 2024

రోహిత్‌ సేన జాగ్రత్త వహించాలి: స్కాట్‌ స్టెర్లిన్‌

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరుగనున్న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టెర్లిన్‌. గత అనుభవాల దృష్ట్యాఈ రోహిత్‌ సేన జాగ్రత్త వహించాలని సూచించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ వేళ జాగ్రత్తగా ఉండాలంటూ న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టెర్లిన్‌ టీమ్‌ ఇండియాను హెచ్చరించాడు. చివరిసారి ఈ రెండు జట్లు పోటీపడ్డ ఆ స్టేడియంలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణం. గతేడాది జరిగిన టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా.. ఈ దాయాది జట్లు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో పోటీ పడగా.. టీమ్‌ ఇండియా చిత్తుగా ఓడింది. ఆపై న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది.

ఈ నేపథ్యంలోనే స్కాట్‌ స్టెర్లిన్‌ ఓ క్రీడా చానెల్‌లో నిర్వహించే ”స్పోర్ట్స్ ఓవర్‌ ది టాప్‌” కార్యక్రమంలో మాట్లాడాడు.
నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని రోహిత్‌ సేనను హెచ్చరించాడు. అప్పుడు టీమిండియా తమను తాము ఒత్తిడిలోకి నెట్టుకుందని, ఇప్పుడు అలాంటి దశలోకి వెళ్లకూడదని సూచించాడు. దూకుడుగా ఆడాలన్నాడు. పటిష్టమైన టీ 20 జట్టు టీమ్‌ ఇండియా సొంతం. అందుకే వారు తమ బలాలకు తగినట్లు ఆడాలని కోరుకుంటున్నా. నాడు పాక్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌ ఈ విషయాన్ని మర్చిపోయి, తమను తాము నియంత్రించుకోవడం వల్లే మూల్యం చెల్లించుకుందని భావిస్తున్నా” అని స్టెర్లిన్‌ అన్నాడు. ఎంతో నైపుణ్యంగల భారత జట్టు తమపై ఒత్తిడి పెంచుకుని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ లోపాన్ని అధిగమిస్తూ ఆ జట్టు ఆసియాకప్‌లో రాణించాలని భావిస్తున్నా.

తమ ప్రతిభతో పాకిస్తాన్‌తో పాటు తాము ఎదుర్కొనే ఇతర జట్లపైన ఒత్తిడి పెంచాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు. కానీ, వారు తమ శక్తిని తాము తగ్గించుకొని ఆడితేమాత్రం తాను కోరుకున్నట్లుగా జరగకపోవచ్చని, ఇలాంటి పరిస్థితులు ఉంటే పాకిస్థాన్‌ పైచేయి సాధించే అవకాశాలున్నాయని కివిస్‌ మాజీ స్పిన్నర్‌ పేర్కొన్నాడు. టి 20 ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టడం భారత అభిమానులు ఇప్పట్లో మర్చిపోరు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం వారికి జీర్ణించుకోలేని విషయం. ఆపై న్యూజిలాండ్‌పైనా పరాజయం పాలై భారీ లీగ్‌ నుంచి మొదటి దశలోనే వెనుతిరిగింది. ఇందుకు ప్రతీకారంగా.. ఆసియాకప్‌లో పాక్‌ను భారత్‌ చిత్తుగా ఓడించి పగ తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement