Friday, May 3, 2024

IPL : ఉప్ప‌ల్ లో ధోనీ నామ స్మ‌ర‌ణ‌… ధోని క్రేజ్ చూసి షాక్ లో క‌మిన్స్ ….

మహేంద్ర సింగ్‌ ధోని.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్‌.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు హైదరాబాద్‌ ప్రేక్షకులు. తలా మైదానంలో అడుగుపెట్టగానే ఆరెంజ్‌ ఆర్మీ సైతం ధోని నామస్మరణతో అభిమానం చాటుకుంది. ఇక సీఎస్‌కే ఫ్యాన్స్‌ తమ జెండాలు రెపరెపలాడిస్తూ ధోనికి ఘన స్వాగతం పలికారు.

కేవలం అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం ధోని ఆగమనాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ అందమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇక ధోని క్రేజ్‌ను చూసి సన్‌రైజర్స్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ ఆశ్చర్యపోయాడు. తమ సొంతమైదానంలో సీఎస్‌కే స్టార్‌కు ప్రేక్షకులు స్వాగతం పలికిన తీరును తాను ముందెన్నడూ చూడలేదన్నాడు. ధోని బ్యాటింగ్‌కు రాగానే.. మైదానం దద్దరిల్లిపోయిందని.. ఇంత వరకూ తాను అంత శబ్దం ఎప్పుడూ వినలేదంటూ ధోని క్రేజ్‌కు ఫిదా అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement