Sunday, April 28, 2024

National : రాంల‌ల్లా మందిరంలో….దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్….

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్ అయోధ్య బాల‌రాముడిని గురువారం ద‌ర్శించుకున్నారు. ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మహారాజ్‌ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇప్పటికే లక్నో జట్టుతో కేశవ్‌ మహారాజ్‌ కలిశాడు.ఈ క్రమంలో ఆయోద్య రామమందిరాన్ని మహారాజ్‌ సందర్శించాడు.

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో కేశవ్‌ షేర్‌ చేశాడు. అందుకు క్యాప్షన్‌గా జై శ్రీరామ్‌ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత సంతతికి చెందిన కేశవ్‌ మహారాజ్‌ ఓ రామభక్తుడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అతడి బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి ”రామ్‌ సియా రామ్‌” అంటూ సాగే పాటను ప్లే చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement