Friday, May 17, 2024

Breaking: రెండో వికెట్​ కోల్పోయిన పాక్​.. ఓపెనర్లిద్దరు అవుట్​

టీమిండియాతో జరుగుతున్న ఐసీసీ వరల్డ్​ కప్​ టీ20 మ్యాచ్​లో పాకిస్తాన్​ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన బాబర్​ ఆజమ్​, రిజ్వాన్​ ఇద్దరినీ బౌలర్​ అర్షదీప్​ సింగ్​ పెవీలియన్​కి పంపాడు. రెండో ఓవర్​లోనే కెప్టెన్​ బాబర్​ ఎల్​బీడబ్ల్యూగా వెనుదిరగగా.. అప్పటికి పాకిస్తాన్​ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. భువి వేసిన తొలి ఓవర్​లో ఒక్క వైడ్​ మినహా ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది పాకిస్తాన్​.

ఇక.. అర్షదీప్​ సింగ్​ వేసిన నాలుగో ఓవర్​లో రిజ్వాన్​ బాల్​ని సిక్స్​బాదబోయి బోర్డర్​లో క్యాచ్​గా దొరకిపోయాడు. దీంతో పాకిస్తాన్​ కీలక రెండు వికెట్లను వెంట వెంటనే కోల్పోయినట్టు అయ్యింది. ప్రస్తుతం క్రీజులో ఇఫ్తీకర్​, షాన్​ ఆడుతున్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్​ టోటల్​ స్కోరు 32 పరుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement