శ్రీలంకతో ఇవ్వాల (మంగళవారం) హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 344 పరుగులు చేసింది. కాగా, 345 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ఈ క్రమంలో శ్రీలంకపై 6 వికెట్ల విజయం సాధించింది. కాగా, పాకిస్తాన్కు ఈ వరల్డ్ కప్లో తొలి విజయం నమోదు చేసుకున్నట్టు అయ్యింది. ఇందులో శఫీక్ (113) సెంచరీ నమోదు చేగా.. రిజ్వాన్ 134 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/002-jpg.webp)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/10/pak3-1024x536.webp)