Monday, April 29, 2024

ODI WC 2023 – ఆహ్మ‌దాబాద్ లో ఆడండి – భార‌త్ ను చిత్తు చేయండిః షాహిద్ అప్రిది..

క‌రాచి – వన్డే ప్రపంచ కప్ లీగ్ పోటీల‌లో భాగంగా భార‌త్ – పాక్ మ‌ధ్య అక్టోబ‌ర్ 15వ తేదిన అహ్మాదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజం సేథి మాట్లాడుతూ, అహ్మదాబాద్‌లో ఆడతామో…? లేదో? కూడా ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాడు. దీంతో పీసీబీ తీరుపై పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ను నిరాకరించడం వెనుక కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు. ..

”అహ్మదాబాద్‌ పిచ్‌పై ఎందుకు ఆడకూడదని అనుకుంటున్నారో మీరు చెప్పగలరా..? అదేమైనా నిప్పులు కురిపిస్తుందా..?లేకపోతే వేటాడుతుందా? మీరు వెళ్లి అక్కడ ఆడాలి. విజయం సాధించాలి. ఇవి మీరు ఊహించిన సవాళ్లు అయితే.. అక్కడికి వెళ్లి అద్భుతమైన విజయం సాధించి వాటిని అధిగమించాలి. భారత్‌ను వారి సొంత మైదానంలో ఓడించడానికి వచ్చిన అవకాశాలపై పీసీబీ దృష్టిపెట్టాలి. అంతేకానీ వెనుకడుగు వేయకూడదు. ఏదైనా సరే సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలి. భారీ ప్రేక్షకుల మధ్య విజయం సాధిస్తే ఆ మజానే వేరు, భార‌త్ ను అహ్మాదాబాద్ లోనే మ‌ట్టిక‌రిపిస్తే పాక్ క్రికెట్ బ‌లం గురించి ప్రంప‌చానికి తెలుస్తుంది ” అని షాహిద్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement