Friday, May 3, 2024

నిఖత్‌ జరీన్‌ను అర్జున్‌ అవార్డు వరించాలి.. స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరెడ్డి ఆకాంక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన అర్జున్‌ అవార్డుల జాబితాలో పేరు ఎంపికయినందుకు ప్రపంచ మహిళా బాక్సింగ్‌ దిగ్గజం, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌కు రాష్ట్ర క్రీడాప్రాదికార సంస్థ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తుది జాబితాలోనూ నిఖత్‌ జరీన్‌ పేరు చేరాలని, అర్జున్‌ అవార్డు ఆమెను వరించాలని ఆకాంక్షించారు. బాక్సింగ్‌లో మరెన్నో విజయాలు సాధించి, రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకున్నారు. గత జులై, ఆగస్టులో బర్మింగ్‌హాంలో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారతదేశానికి నిఖత్‌ జరీన్‌ బంగారు పతకం సాధించిపెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement