Monday, April 29, 2024

సెంచరీతో అదరగొట్టిన రాహుల్.. మెరిసిన రోహిత్..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు జోరుగా ఆడటంతో ఇంగ్లాండుపై తొలి రోజు మనదే పైచేయి. ముఖ్యంగా కె ఎల్ రాహుల్, రోహిత్ శర్మ చూడముచ్చటైన ఇన్నింగ్స్ ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. లార్డ్స్‌లో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం 1952 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో వినూ మన్కడ్-పంకజ్ రాయ్ ఈ ఘనత సాధించారు. అలాగే, టెస్టుల్లో రోహిత్-రాహుల్ తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించడం ఇది రెండోసారి.

భారత ఓపెనర్లు ఆరంభంలో పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. రోహిత్, రాహుల్‌ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలా మొదటి పది ఓవర్లలో ఓపెనింగ్‌ జోడి 11 పరుగులే చేయగలిగింది. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన రోహిత్ ఆ తర్వాత జోరు పెంచాడు. వరస ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 145 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్.. సెంచరీ ముంగిట జేమ్స్ అండర్సన్ బౌలింగులో బౌల్డయ్యాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో భారత జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా మరోమారు తీవ్రంగా నిరాశపరచగా, కెప్టెన్ కోహ్లీ 42 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగులో వెనుదిరిగాడు.

సెంచరీ కూడా రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. తొలి వంద బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ఆ తర్వాత 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మరో 75 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం గమనార్హం. కాగా, రాహుల్ (127), రహానే (1) క్రీజులో ఉన్నారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో వారే న్యాయ నిర్ణేతలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement