Saturday, July 27, 2024

అహ్మదాబాద్‌ హెడ్‌ కోచ్‌గా కిర్‌స్టన్‌.. బౌలింగ్‌ కోచ్‌గా ఆశీష్‌ నెహ్రా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌లో లక్నో, అహ్మదాబాద్‌ జట్లు కొత్తగా టైటిల్‌ పోరులో నిలవనున్నాయి. ఐపీఎల్‌ 2022లో ఈ రెండు జట్లు బరిలోకి దిగనుండటంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరనుంది. ఈక్రమంలో అహ్మదాబాద్‌ హెడ్‌ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2011లో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలుచుకోవడంలో కోచ్‌గా కిర్‌స్టెన్‌ కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా కోచ్‌గా కిర్‌స్టెన్‌ నియమితుడయ్యాడు.

ఇంతకుముందు గ్యారీ కిర్‌స్టెన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. తాజాగా అహ్మదాబాద్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడని సమాచారం. మరోవైపు టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అహ్మదాబాద్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంతకుముందు నెహ్రా సన్‌రైజర్స్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement