Friday, May 10, 2024

Indonesia Masters | క్వార్టర్స్‌కు కిరణ్ జార్జ్ !

ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భాగంగా ఇవ్వాల (గురువారం) జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ విజయం సాధించాడు. చైనాకు చెందిన లు-గ్వాంగ్జు తో జరిగిన ఈ మ్యాచ్‌లో 21–11, 13–21, 21–18 పాయింట్ల తేడాతో గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

కాగా, మరోవైపు.. భారత్‌కు చెందిన లక్ష్యసేన్, ప్రియాంషు రజావత్ లకు తమ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో నిరాశే మిగిలింది. తమ ప్రత్యర్థులపై వరుస గేమ్‌లలో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగారు. డెన్మార్క్‌కు చెందిన అండర్స్ ఆంటోన్‌సెన్‌తో తలపడిన సేన్ 19-21, 18-21తో ఓటమి పాలయ్యాడు. ఇక, కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్‌తో తలపడిన రాజావత్ 18-21, 14-21 తేడాతో ఓడిపోయాడు.

అయితే, ప్రస్తుతం ఈ టోర్నీలో ఏకైక భారతీయుడిగా కిరణ్ జార్జ్ మాత్రమే కొనసాగుతున్నాడు. కాగా, రెండో రౌండ్ విజయం సాధించి క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ కు చేరుక‌న్న కిర‌ణ్ తన నెక్స్ట్ మ్యాచ్‌లో థాయ్ కు చెందిన కున్లావుట్ విటిద్సర్న్ తో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement