Sunday, May 5, 2024

3rd TEST: టాస్ గెలిచిన భార‌త్‌… ముందు బ్యాటింగ్ దిగుతున్న టీమిండియా

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజ్‌కోట్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ టెస్ట్ కోసం రోహిత్ ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్, కేఎస్ భారత్ స్థానంలో జురెల్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పసర్లతో బరిలోకి దిగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement