Friday, May 3, 2024

Big Breaking: మూడు వన్డేల మాస్టర్​కార్డ్​ సిరీస్​ భారత్​ కైవసం.. బ్యాటింగ్​, బౌలింగ్​లో గబ్బర్​ బ్యాచ్​ సూపర్​​!

భారత్​, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్​ని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్​ని గెలిచి హీట్​ పెంచిన సఫారీలు ఆ తర్వాత రెండో మ్యాచ్​లో ఘోరంగా ఓడిపోయారు. ఇక.. ఇరు జట్లకు కీలకంగా మారిన మూడో మ్యాచ్​లో అయితే.. టీమిండియా బౌలర్ల దెబ్బకు క్రీజు వీడిచి ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్​కు క్యూ కట్టారు. ఇందులో కుల్దీప్​ యాదవ్​ 4 వికెట్లు తీసి సఫారీల వెన్నువిరిచాడు.  ఈ క్రమంలో 50 ఓవర్ల మ్యాచ్​ 26 ఓవర్లలోనే ముగిసింది. దీంతో 99 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్​ అయ్యింది..

కాగా, సెకండ్​ ఇన్నింగ్స్​లో 100 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్​ శిఖర్​ ధావన్​ (8) పరుగులు మాత్రమే చేశాడు. శుభ్​మన్​ గిల్  ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయి ఆడి క్రికెట్​ అభిమానులను అలరించాడు. గిల్​కు తోడుగా వన్​డౌన్​లో ఇషాన్​ కిషాన్​ (10) క్రీజులోకి రావడంతో ఇద్దరు కలిసి కాసేపు స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. కాగా 10వ ఓవర్​లో భారత్​ 98 పరుగుల వద్ద కిషన్​ క్యాచ్​ అవుటయ్యాడు. దీంతో శ్రేయస్​ అయ్యర్​ 28, గిల్​ 53 కలిసి మ్యాచ్​ని ముగించేద్దామనుకుంటే 18వ ఓవర్​ ఆఖరి బంతికి అంటే.. గిల్​ 49 పరుగుల వద్ద రబడా వేసిన బంతితో ఎల్​బీ డబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో టీమిండియా 18 ఓవర్​లో 3వ వికెట్​ కోల్పోయింది. టార్గెట్​ని రీచ్​ చేసే క్రమంలో ఆ తర్వాత సంజు శాంసన్​ 2 రాకతో మ్యాచ్​ 19వ ఓవర్​లో ఫినిష్​ అయ్యింది. మూడు వన్డేల మాస్టర్​కార్డ్​ సిరీస్​ని భారత్​ సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement