Friday, May 17, 2024

3rd TEST: బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌… పెవిలియ‌న్ బాట ప‌ట్టిన బ్యాట‌ర్లు

రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. రెండో టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన య‌శ‌స్వీ జైశ్వ‌ల్ మూడో టెస్టులో 10ప‌రుగులు చేసి ఆదిలోనే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

దీంతో టీమిండియా 22ప‌రుగుల వ‌ద్ద త‌న తొలి వికెట్‌ను కొల్పోయింది. ఇక క్రీజులోకి వ‌చ్చిన సుమ‌న్‌గిల్ కూడా కొద్దిసేపు కూడా నిల‌వ‌లేక‌పోయాడు. 9బంతులాడిన గిల్ ఒక్క ప‌రుగు చేయ‌కుండానే క్రీజును వ‌దిలాడు. ఇద్ద‌రినీ మార్క్ వుడ్ ఔట్ చేసి.. భార‌త్‌కు ఆదిలోనే షాక్‌నిచ్చాడు. దీంతో టీమిండియా 24ప‌రుగుల‌కే 2వికెట్ల‌ను కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement