Sunday, April 28, 2024

Cricket | భారత్,​ బంగ్లా వన్డే మ్యాచ్​.. ఒక వికెట్​ తేడాతో విజయం సాధించిన బంగ్ల జట్టు

బంగ్లాదేశ్‌ పర్యటనలో టీమిండియా ఇవ్వాల ఫస్ట్​ వన్డే మ్యాచ్​ ఆడింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్​ 186 పరుగులకు ఆల్​ అవుట్​ అయ్యింది. అయితే.. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన బంగ్లా జట్టు 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్​లలో వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్​కు న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో గట్టి షాకే తగిలింది.

అయితే.. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలోనూ పరాజయం మరింత ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఇవాళ్టి నుంచి 3 వన్డేల సిరీస్‌ ఆడబోతోంది. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ రావడంతో జట్టు పటిష్టంగా ఉన్నా.. బంగ్లా కుర్రాళ్లపై పెద్దగా మెరుగైన ఆటతీరు కనబర్చనట్టుందని విమర్శకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement