బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఇవ్వాల ఫస్ట్ వన్డే మ్యాచ్ ఆడింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ 186 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అయితే.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్లలో వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్కు న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో గట్టి షాకే తగిలింది.
అయితే.. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలోనూ పరాజయం మరింత ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఇవాళ్టి నుంచి 3 వన్డేల సిరీస్ ఆడబోతోంది. కెప్టెన్ రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రాహుల్ రావడంతో జట్టు పటిష్టంగా ఉన్నా.. బంగ్లా కుర్రాళ్లపై పెద్దగా మెరుగైన ఆటతీరు కనబర్చనట్టుందని విమర్శకులు అంటున్నారు.